25, సెప్టెంబర్ 2017, సోమవారం

బాహుబలి తదుపరి స్థానం దిశగా జై లవకుశ

జూ. ఎన్ టి ఆర్ తొలిసారిగా మూడు పాత్రలలో సమర్ధవంతంగా  నటించిన "జై లవ కుశ" సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.  నాలుగు రోజులలోనే  100 కోట్ల కలెక్షన్స్ చేరువైన ఈ చిత్రం రానున్న రోజులలో తెలుగులో భాహుబలి తదుపరి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం  చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" తెలుగులో సుమారు 160 కోట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో ప్రవేశించినందున, దసరా సెలవులు కావడం ఈ సినిమాకు బాగా కలసి వచ్చింది. ఈ వారం విడుదల కానున్న మహేష్ బాబు "స్పైడెర్" రెస్పాన్స్ కూడ "జై లవ కుశ" వసూళ్ళ గణాంకాలను ప్రభావితం చేసే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి 150 కోట్లు వసూళ్ళు చేస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. వరుసగా నాలుగవ చిత్రం విజయం సాధించడం, మరో ప్రక్క వ్యాఖ్యాతగా వ్యవహరించిన "బిగ్ బాస్" టి వి రియాలిటి షో గ్రాండ్ సక్సెస్ కావడంతో  జూ. ఎన్ టి ఆర్ మంచి జోష్ మీద వున్నారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...