30, సెప్టెంబర్ 2017, శనివారం

శర్వానంద్ ఖాతాలో మరో హిట్ "మహానుభావుడు"

ఈ ఏడాది సంక్రాంతికి "శతమానంభవతి"లాంటి  మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బోణీ కొట్టిన  శర్వానంద్ ను , తదుపరి "రాధా" రూపంలో అపజయం పలకరించింది. హాస్యానికి పెద్ద పీట వేసి విజయాలు దక్కించుకొంటున్న  మారుతి   దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తాజ విడుదల "మహానుభావుడు" హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అతి శుబ్రత అనే విపరీత మనస్థత్వంతో, వింత వింత విన్యాసాలు చేసే హీరో పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని శర్వానంద్ ను ప్రశంసిస్తున్నారు. "గమ్యం", "ప్రస్థానం" చిత్రాల ద్వారా మంచి ప్రతిభ గల యువ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, "రన్ రాజా రన్". "ఎక్స్ ప్రెస్ రాజా", "రాజాధి రాజా" చిత్రాలలో తనలోని హాస్య రస పోషణను  కూడా  నిరూపించుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన "శతమానంభవతి" ఓవర్ ఆల్ గా 50 కొట్ల కలెక్షన్స్ వసూలు చేసి హీరోగా శర్వానందుకు సరి కొత్త మార్కెట్ ను తెచ్చిపెట్టింది.  రెండు భారీ చిత్రాల మధ్య దసరాకు విడుదలైన "మహానుభావుడు" 35 - 40 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని పరిశ్రమ వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏ సంకోచం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా భరొసా ఇస్తున్నారు ప్రేక్షకులు.

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు అందుకున్న "స్పైడర్"


                                                                                                                                                                                                                          భారీ చిత్రాల దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్,  తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో ద్విభాషా చిత్రంగా విడుదలైన "స్పైడర్" చక్కని కలెక్షన్స్ రాబడుతుంది.  ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినా, కలెక్షన్స్ మాత్రం భారీగానే కొల్లగొడుతుంది. రెండు రోజులకే 85 కోట్లు సుమారు వసూలు చేసి, 100 కోట్ల దిశగా పయనిస్తుంది.  హీరో, విలన్ పాత్రల వైవిద్య సృష్టి, చిత్రీకరణ, సాంకేతిక హంగుల వినియోగంలో అంతర్జాతీయ స్థాయి పని తీరు కనబరిచాడు దర్శకుడు మురుగ దాస్.  ప్రాంతీయ భాషా అగ్ర హీరోల హీరోయిజంపై ఒక బలమైన ముద్ర ఏర్పడి పోయి వున్న మాస్ ప్రేక్షకులలో ఈ వినూత్న తరహాపై భిన్న స్వరాలు వినిపించాయి.  తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంచి సందేశాన్ని అత్యున్నత రీతిలో దర్శకుడు మురుగ దాస్ మలిచారని, మహేష్ చక్కని పెర్ఫార్మెన్స్ చేశాడని,  మొత్తం స్పైడర్ టీంకు అభినందనలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ అన్నారు. ఇది "స్పైడర్" కు లభించిన అమూల్యమైన గౌరవం. వారాంతం, దసరా సెలవులు టాక్ తో సంబందం లేకుండా కలెక్షన్స్ రాబట్టడానికి దోహదం చేస్తున్నాయి.       

25, సెప్టెంబర్ 2017, సోమవారం

బాహుబలి తదుపరి స్థానం దిశగా జై లవకుశ

జూ. ఎన్ టి ఆర్ తొలిసారిగా మూడు పాత్రలలో సమర్ధవంతంగా  నటించిన "జై లవ కుశ" సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.  నాలుగు రోజులలోనే  100 కోట్ల కలెక్షన్స్ చేరువైన ఈ చిత్రం రానున్న రోజులలో తెలుగులో భాహుబలి తదుపరి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం  చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" తెలుగులో సుమారు 160 కోట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో ప్రవేశించినందున, దసరా సెలవులు కావడం ఈ సినిమాకు బాగా కలసి వచ్చింది. ఈ వారం విడుదల కానున్న మహేష్ బాబు "స్పైడెర్" రెస్పాన్స్ కూడ "జై లవ కుశ" వసూళ్ళ గణాంకాలను ప్రభావితం చేసే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి 150 కోట్లు వసూళ్ళు చేస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. వరుసగా నాలుగవ చిత్రం విజయం సాధించడం, మరో ప్రక్క వ్యాఖ్యాతగా వ్యవహరించిన "బిగ్ బాస్" టి వి రియాలిటి షో గ్రాండ్ సక్సెస్ కావడంతో  జూ. ఎన్ టి ఆర్ మంచి జోష్ మీద వున్నారు.   

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

దసరాకు సందడి చేయనున్న అగ్ర హీరోలు

బాహుబలి 2 తదుపరి విడుదలైన పెద్ద సినిమాలు దువ్వాడ జగన్నాదం, పైసా వసూల్ పరిశ్రమకు వసూళ్ళ వుత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ మద్యలో నిన్నుకోరి, ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మా, అర్జున్ రెడ్డి లాంటి చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను కొంచెం కళ కళ లాడించాయి. ఇప్పుడు మళ్ళీ బాక్సాఫీస్ రికార్డ్ లెక్కలను సవరించుకొనే సమయం వచ్చేసింది. జూనియర్ ఎన్ టి ఆర్ తొలిసారిగా కుటుంబ సంస్థ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ లో రవీంద్ర దర్శకత్వంలో నటించిన "జై లవ కుశ" ఈ నెల 21 న విడుదల కానుంది. ఇందులో ఎన్ టి ఆర్ మూడు పాత్రల లో నటించడం విశేషం. అదే విధంగా మహేష్ బాబు, ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించిన"సైడర్" కూడా ఈ నెల 27 న విడుదలకు రంగం సిద్దం అయ్యింది.  బాహుబలి 2 తదుపరి అత్యధిక వ్యయంతో తెలుగులో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి తెరపంచుకొంటోంది. దసరాకు కనుల విందుకు సిద్ధమైన ఈ చిత్రాలు - టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ లను నెలకొల్పడం ఖాయం అంటున్నాయి  పరిశ్రమ వర్గాలు.    

7, సెప్టెంబర్ 2017, గురువారం

2000 కు పైగా సినిమాలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన ఉషాపిక్చర్స్ (ఏలూరు)

1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, మరెంతో అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని విజయప్రస్థానాన్ని కొనసాగిస్తూంది. ప్రముఖ పంపిణీ సంస్థలుగా పేరుగడించిన ఎన్నో సంస్థలు ఈ రంగంలోని అనిశ్చిత పరిస్తితుల  కారణంగా కనుమరుగైనా,  నాలుగున్నర దశాబ్ధాలుగా అప్రతిహతంగా పయనిస్తుంది. గతంలో 5,6 చిత్రాలు అపజయంపాలు అయినా,  ఒక చిత్రం విజయంసాధిస్తే నష్టాలు భర్తీ అయిపోయేవని - నేడు 5,6 చిత్రాలు విజయం సాధించినా, ఒక చిత్రం అపజయంతో మొత్తంగా దివాళా తీసే పరిస్థితులు  నెలకొన్నాయని ఈ పంపిణీ రంగంలోని వారు అంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అత్యధిక చిత్రాలను పంపిణీ చేసిన సంస్థగా " లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ " లో స్థానం సంపాధించింది ఈ సంస్థ.  ఉషా గ్రూప్స్ కు ఫైనాన్స్, హోటల్, ఆగ్రో తదితర సంబందిత వ్యాపారాలు ఉన్నా యజమాని బాల కృష్ణా రావు కు సినిమా పంపిణీ, ప్రదర్శన రంగాలపైనే  విపరీతమైన ప్రేమ.  రాష్ట్ర ఫిలిం చాంబర్ అధ్యక్షులుగా,మరియు మరెన్నో పరిశ్రమకు సంబందించిన కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. స్వగ్రామం కొవ్వలి లోను, జిల్లా కేంద్రం ఏలూరు లోను ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. అదే విధంగా వందలమందికి ఉపాధి కల్పిస్తూ ఆ కుటుంబాల ఆశీస్సులను పొందుతున్నారు వి.వి. బాలకృష్ణా రావు.  

2, సెప్టెంబర్ 2017, శనివారం

ప్రేక్షకుల నుండి "పైసా వసూల్" అయ్యేనా!

 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తదుపరి నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ తో చిత్రం అనౌన్స్ చేయగానే పరిశ్రమలో   తీవ్ర  ఆసక్తి  నెలకొంది.  ఇద్దరూ డిఫరెంట్ స్కూల్స్ అవడంతో ఎవరు ఎవరి శైలి ఫాలో అవుతారో అన్న ఉత్కంఠకు శుక్రవారంతో తెర పడింది. "పైసా వసూల్" లో బాలకృష్ణను డిఫెరెంట్ గా చూపడంలో పూరీ కృతకృత్యుడయ్యాడు.  కాకపోతే పూరీ మాత్రం తన మూస ధోరణి నుండి బయటపడలేక,  సినిమా అంతా తన గత చిత్రాల వాసనలతో నింపేశాడంటున్నారు.  ఫస్ట్ హాఫ్ ను రసవత్తరంగా మలచినా,  సినిమాకు ప్రాణం అయిన సెకండ్ హాఫ్ ను ఆ మేరకు రక్తి కట్టించలేక పోయాడు.  పూరీ చిత్రాలలో చిత్రం జయాపజయాలకు అతీతంగా, హీరోయిన్, విలన్ పాత్రలు, సాంగ్స్ కు ప్రత్యేకత వుంటుంది.  ఈ చిత్రంలో వాటికీ   న్యాయం చేయలేక పోయాడంటున్నారు.  బాలకృష్ణలాంటి సీనియర్ హీరో పూరి దర్శకత్వంలో ఎటువంటి భేషజం  లేకుండా   ఒదిగిపోయి నటించడమన్నది అభినందించాల్సిన విషయం.  ఫైనల్ గా "పైసా వసూల్"  ఫక్తు బాలకృష్ణ అభిమానుల చిత్రంగా తేల్చేశారు ప్రేక్షకులు.  

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...