17, నవంబర్ 2017, శుక్రవారం

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం" వరుస చిత్రాలతో ఈ ఫార్ములా ఉపయోగించి  హిట్ లు కొట్టగా,  ఇప్పుడు తమ్ముడు కార్తి అదే బాటలో పయనించి విజయంసాధించాడు.   1995 ప్రాంతంలో తమిళనాడులో జరిగిన వరుస హత్యానేరాల వాస్తవ నేపథ్యంతో రూపొందిన ఈ "ఖాకి" చిత్రం  తెలుగు,  తమిళ భాషలలో నేడు విడుదలై హిట్ టాక్ పొందడంతో  కార్తి చిత్రాలలోకెల్ల ఎక్కువ వసూళ్ళు రాబడుతున్న చిత్రంగా నిలిచే అవకాశం వున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  క్లిష్టమైన కేసులు పరిష్కరించడంలో పోలీసులు ఎంతగా శ్రమిస్తారో,  సహజత్వానికి వీలైనంత దగ్గరగ,  వుత్కంఠభరితంగా చిత్రీకరించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.  పోలీస్ ఆఫీసర్ గా కార్తి నటన, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు.  పోలీస్ తరహా యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు పసందైన కాలక్షేపం.     

8, నవంబర్ 2017, బుధవారం

రెండున్నర దశాబ్దాల అనంతరం నాగార్జున, వర్మల క్రేజీ కాంబినేషన్

తెలుగు చిత్ర రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ "శివ". నాగార్జున, వర్మల తొలి కలయికలో వచ్చిన ఈ చిత్ర ప్రభావం నేటి చిత్రాలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. తరువాత వీరి కలయికలో అంతం, గోవిందా..గోవిందా.. చిత్రాలు వచ్చాయి. ఆ తదుపరి వర్మ బాలివుడ్ లో బిజీ అవడం, టాలివుడ్ కు తిరిగివచ్చినా పెద్ద చిత్రాలు ఏవీ చేయక పోవడంతో ఈ జోడీ కుదరలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల విరామం తరువాత నాగార్జున అభిమానుల కోరిక తీరనున్నది.  వర్మతో చిత్రాన్ని కంఫర్మ్ చేసిన నాగార్జున కొన్ని కండిషన్స్ వర్మ ముందుంచారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి సమయం కేటాయించాలని, చిత్రం పూర్తి అయ్యే వరకు మరే ప్రాజెక్ట్ చేపట్టకూడదని నాగార్జున చెప్పిన మీదట వర్మ తన పూర్తి అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తుంది.  ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారు.  ఈ నెలలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం జరగనున్నది. 

7, నవంబర్ 2017, మంగళవారం

పది సంవత్సరాలు రాజశేఖర్ వేచిన విజయం "గరుడ వేగ"

 ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా. రాజశేఖర్ నటించిన "గరుడ వేగ" మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతోంది. పది సంవత్సరాల క్రితం వచ్చిన "ఎవడైతే నాకేంటి" కమర్షియల్ విజయం తరువాత ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు రాజశేఖర్ కు. సినీ రంగ పరంగానే కాకుండా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రాజశేఖర్ ఈ మద్య కాలంలో. ఇటీవలనే తల్లి చనిపోవడం మరి కొన్ని అనవసర వివాదాలతో సతమతమౌతున్న రాజశేఖర్ కు, అతని కుటుంబానికి ఇది అద్భుతమైన వుత్సాహాన్ని ఇస్తున్న విజయం. ఇది పూర్తిగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్రెడిటేనంటున్నారు పరిస్రమ పెద్దలు. రాజశేఖర్ స్థాయికి మించిన బడ్జెట్ పెట్టి, మళ్ళీ అప్పటి యాంగ్రి హీరొ ఇమేజ్ ను పునరుద్దరించారని మెచ్చుకుంటున్నారు. ఎన్ ఐ ఏ ఏజెంట్ గా తన స్టైల్ నటనతో, యువ హీరోలా పరిస్రమించి పాత్రకు న్యాయం చేకూర్చారు రాజశేఖర్. ఈ చిత్రం రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది గా ప్రస్థావిస్తున్నారు.      

2, నవంబర్ 2017, గురువారం

మరోసారి సెంటిమెంట్ ప్రయోగించిన బాలకృష్ణ

గతంలో నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ మరోసారి తన 102 వ చిత్రానికి "జై సిం హా" టైటిల్ నిర్ణయించడం ద్వారా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు.  సి. కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం బాలకృష్ణకు మరో సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదల కానుండడం ఆయన అభిమానులకు పండుగే. "పైసావసూల్" అపజయం మరపించేలా, ఈ చిత్రం సూపర్ హిట్ అయి రెండు సెంటిమెంట్లను రుజుచేస్తుందని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.

20, అక్టోబర్ 2017, శుక్రవారం

రవితేజ కొత్తగా ట్రై చేసిన "రాజ ది గ్రేట్"

నటనలోనే కాదు, సినిమాలు చేయడంలోను దూకుడు మీద వుండే రవితేజ - రెండు సంవత్సరాల విరామం అనంతరం విడుదలైన చిత్రం "రాజ ది గ్రేట్".  12 సంవత్సరాల తరువాత దిల్ రాజు తో రవితేజ చేసిన చిత్రంగా కూడా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన కలయిక ఇది.  పటాస్, సుప్రీం చిత్రాలతో జోరు మీద వున్న అనిల్ రావిపూడి దీనికి దర్శకుడు.  రొటీన్ కథకు వెరైటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అయిందనే అంటున్నారు ప్రేక్షకులు.  మాస్ మహారాజాగా మన్ననలు పొందుతున్న రవితేజలాంటి హీరో చేత పూర్తి నిడివి  అంధత్వంగల పాత్ర  చేయించడమన్నది ప్రయోగమే. అయినప్పటికి ఆ పాత్రపై ప్రేక్షకులకు సింపతీ ఏర్పడకుండా జోష్ మీద నటించి క్రెడిట్ కొట్టేసాడు రవితేజ.  చాల గాప్ తరువాత వచ్చినా న్యూ లుక్ తో, ఫుల్ ఎనర్జిటిక్ గా చేసాడని యూత్ ఆడియన్స్ కితాబిస్తున్నారు.  ఇన్ని రోజుల  విరామం  తీసుకున్నది మొనాటని బ్రేక్ చేయడానికే అన్న రవితేజ మాటలలాగే ఈ చిత్రం "రవి తేజ వన్ మాన్ షో" అనిపించుకుంటుంది. రవితేజ ను 50 కోట్ల కలెక్షన్స్ లో చేర్చే మొట్ట మొదటి చిత్రం ఇదే కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.   

17, అక్టోబర్ 2017, మంగళవారం

తారాబలమే నిలిపిన "రాజుగారి గది2"

దర్శకుడు ఓంకార్ "రాజుగారి గది" చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో వుండగానే పి.వి.పి సంస్థ, నాగార్జున అందులో పాలు పంచుకోవడానికి సిద్ద పడడంతోటే పెద్ద చిత్రంగా ప్రణాళిక రూపుదిద్దుకొంది "రాజు గారి గది2". అందరూ చిన్న స్థాయి నటులే అయినా - మంచి కామెడి,సస్పెన్స్,హారర్ తో ప్రేక్షకులను అలరించి సొమ్ము చేసుకుంది "రాజుగారి గది". నాగార్జున- సమంతల చేరికతో పెద్ద చిత్రంగా, కొన్ని అంచనాల మద్య విడుదలైన "రాజుగారి గది2" ఓపినింగ్ కలెక్షన్స్ బాగానే రాబట్టుకోంది. మొదటి చిత్రంలోలా కామెడి, హారర్ లు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, నాగార్జున-సమంతలే సినిమాను నిలబెట్టారంటున్నారు ప్రేక్షకులు. చిన్న నటులతో ఎంతో స్వేచ్చగా తీయగలిగిన దర్శకుడు ఓంకార్, పెద్ద నటుల ప్రవేశంతో హ్యూమర్, సస్పెన్స్,థ్రిల్లర్ లను అనుకున్నంతగా బ్యాలెన్స్ చేయలేక పోయాడంటున్నారు విశ్లేషకులు. ఏవరేజ్ టాక్ తో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

11, అక్టోబర్ 2017, బుధవారం

అలుపేలేని నటనకు కేరాఫ్ అడ్రస్

సాధారణంగా ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ వయసు 58-60 సంవత్సరాలు.  ఆ లెక్కన చూసుకుంటే అమితాబ్ బచ్చన్ రిటైర్ అయి 15 సంవత్సరాలు అవుతుంది.  75 సంవత్సరాల వయసులో కూడా 25  సంవత్సరాల కుర్రాడిలా ఇటు సినిమాలు,  అటు టి.వి షోలతో బిజీగా వున్నారు. 1969లో చిత్ర రంగ ప్రవేశం చేసిన అమితాబ్, సాథ్ హిందుస్థానీ చిత్రంతో మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నారు. 1973లో వచ్చిన "జంజీర్" అమితాబ్ కు స్టార్డం తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం జయభాధురితో వివాహం జరిగింది.1975 సంవత్సరం అమితాబ్ కు గొప్ప మలుపు ఇచ్చిన సంవత్సరంగా నిలిచిపోయింది. "దీవార్" తో మరోసారి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకోవడమే కాకుండా "షోలే" రూపంలో భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బంపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలివుడ్ లో అమితాబ్ కు ఎదురేలేక పోయింది. 1982 లో "కూలీ" షూటింగ్ సందర్భంగా తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి విజయుడిగా  నిలిచారు. సాక్ష్యాత్ దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అమితాబ్ చికిత్సపై డాక్టర్స్ ను ప్రత్యేకంగా సంప్రదించారంటే అమితాబ్ ప్రాముఖ్యత అర్ధమౌతుంది. ఇందిరా గాంది మరణం తదుపరి ఆమె కుమారుడు రాజీవ్ గాంధి విజ్ణప్తి పై కాంగ్రెస్ పార్టీలో చేరి,  ఉత్తర్ ప్రదేశ్ నుండి ఎం.పి గా ఎన్నికయ్యారు. రాజకీయాలు తనకు సరిపడని అంశమని కొద్ది కాలంలోనే బయటకు వచ్చేసారు.   సెకండ్ ఇన్నింగ్స్ లో "షెహన్ షా", "హం", "అగ్నిపత్", "ఖుదాగవా"  చిత్రాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. "అగ్నిపత్" లో నటనకు గాను మొట్ట మొదటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. తరువాత కొన్ని పరాజయాలు పలకరించడంతో మళ్ళీ విరామం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అమితాబ్ ప్రారంభించిన "ఎబిసిఎల్" మొదట్లో బాగానే వున్నా, తదుపరి తీవ్ర నష్టాలలో కూరుకు పోయింది. మరల 2000 నుండి వయసు మీరిన పాత్రలతో నటిస్తుండడం, మరో ప్రక్క "కౌన్ బనేగా కరోడ్పతి" టివి షో వ్యాఖ్యాతగా విషేషంగా రాణిస్తూ ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. 2005లో "బ్లాక్", 2008 లో "పా", 2015 లో "పీకు" చిత్రాలలోని పాత్రలకుగాను బెస్ట్ ఏక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డ్స్,  పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తీసుకోవడమే కాకుండా, "సూపర్ స్టార్" అన్న పదానికి సార్ధకత చేకూర్చారు అమితాబ్. నేడు 75 వ జన్మదినం జరుపుకొంటున్న అమితాబ్ కు భారతీయ సినీ పరిశ్రమ ఘనంగా శుభాకాంక్షలు పలుకుతుంది.       

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...