2, అక్టోబర్ 2017, సోమవారం

ఎన్ టి ఆర్ జీవిత చిత్రాల మధ్య రగులుతున్న వివాదం

సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడిన మనిషి.  అటువంటి వ్యక్తి జీవత చరిత్రపై ప్రస్తుతం నిర్మాణం కానున్న చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.  మొదటిగా ఎన్ టి ఆర్ కుమారుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్ టి ఆర్ జీవిత కథను తనే హీరోగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. స్వతహాగానే కుటుంబం అంతా మద్దతు ప్రకటించారు.  లక్ష్మీ పార్వతి మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.  ఈ చిత్రంలో తననే విలన్ గా చూపే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆందోళన పడుతున్నారు. ఎన్ టి ఆర్ కుటుంబ కోణంలో చూస్తే లక్ష్మీ పార్వతి ప్రవేశం అన్నది ఎన్ టి ఆర్ పతనానికి నాందీవాచకం.  ఇటువంటి సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్ టి ఆర్" చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా,  ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులలో కలవరం రేకెత్తిస్తుంది.  ఇది లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తున్న చిత్రం కాబట్టి, ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులు పై వ్యతిరేక ప్రభావం ఏర్పడేలా చిత్రీకరణ జరుగుతుందని వారు  ఆందోళన చెందుతున్నారు.  బాలకృష్ణ చిత్రం ఇంకా కథా చర్చలలోనే వుంది.  కానీ రాంగోపాల్ వర్మ తలచుకుంటే నెల రోజులలోనే తన సినిమా పూర్తి చేసి జనంలోకి వదిలేయగలడు.  వివాదాస్పద అంశాలు, ఘటనలే రాంగోపాల్ వర్మకు ప్రచార సాధనాలు,  ఆదాయ వనరులు.  ఎవరి మనోభావాలు, అభిప్రాయాలతోను పనిలేకుండా తను అనుకున్నది తీయడమే వర్మ నైజం.  ఈ చిత్రానికి లక్ష్మీ పార్వతి తెరవెనుక నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినవస్తున్నాయి. ఎవరి చిత్రం వాస్తవానికి దగ్గరగా వుండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...