20, అక్టోబర్ 2017, శుక్రవారం

రవితేజ కొత్తగా ట్రై చేసిన "రాజ ది గ్రేట్"

నటనలోనే కాదు, సినిమాలు చేయడంలోను దూకుడు మీద వుండే రవితేజ - రెండు సంవత్సరాల విరామం అనంతరం విడుదలైన చిత్రం "రాజ ది గ్రేట్".  12 సంవత్సరాల తరువాత దిల్ రాజు తో రవితేజ చేసిన చిత్రంగా కూడా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన కలయిక ఇది.  పటాస్, సుప్రీం చిత్రాలతో జోరు మీద వున్న అనిల్ రావిపూడి దీనికి దర్శకుడు.  రొటీన్ కథకు వెరైటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అయిందనే అంటున్నారు ప్రేక్షకులు.  మాస్ మహారాజాగా మన్ననలు పొందుతున్న రవితేజలాంటి హీరో చేత పూర్తి నిడివి  అంధత్వంగల పాత్ర  చేయించడమన్నది ప్రయోగమే. అయినప్పటికి ఆ పాత్రపై ప్రేక్షకులకు సింపతీ ఏర్పడకుండా జోష్ మీద నటించి క్రెడిట్ కొట్టేసాడు రవితేజ.  చాల గాప్ తరువాత వచ్చినా న్యూ లుక్ తో, ఫుల్ ఎనర్జిటిక్ గా చేసాడని యూత్ ఆడియన్స్ కితాబిస్తున్నారు.  ఇన్ని రోజుల  విరామం  తీసుకున్నది మొనాటని బ్రేక్ చేయడానికే అన్న రవితేజ మాటలలాగే ఈ చిత్రం "రవి తేజ వన్ మాన్ షో" అనిపించుకుంటుంది. రవితేజ ను 50 కోట్ల కలెక్షన్స్ లో చేర్చే మొట్ట మొదటి చిత్రం ఇదే కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.   

17, అక్టోబర్ 2017, మంగళవారం

తారాబలమే నిలిపిన "రాజుగారి గది2"

దర్శకుడు ఓంకార్ "రాజుగారి గది" చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో వుండగానే పి.వి.పి సంస్థ, నాగార్జున అందులో పాలు పంచుకోవడానికి సిద్ద పడడంతోటే పెద్ద చిత్రంగా ప్రణాళిక రూపుదిద్దుకొంది "రాజు గారి గది2". అందరూ చిన్న స్థాయి నటులే అయినా - మంచి కామెడి,సస్పెన్స్,హారర్ తో ప్రేక్షకులను అలరించి సొమ్ము చేసుకుంది "రాజుగారి గది". నాగార్జున- సమంతల చేరికతో పెద్ద చిత్రంగా, కొన్ని అంచనాల మద్య విడుదలైన "రాజుగారి గది2" ఓపినింగ్ కలెక్షన్స్ బాగానే రాబట్టుకోంది. మొదటి చిత్రంలోలా కామెడి, హారర్ లు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, నాగార్జున-సమంతలే సినిమాను నిలబెట్టారంటున్నారు ప్రేక్షకులు. చిన్న నటులతో ఎంతో స్వేచ్చగా తీయగలిగిన దర్శకుడు ఓంకార్, పెద్ద నటుల ప్రవేశంతో హ్యూమర్, సస్పెన్స్,థ్రిల్లర్ లను అనుకున్నంతగా బ్యాలెన్స్ చేయలేక పోయాడంటున్నారు విశ్లేషకులు. ఏవరేజ్ టాక్ తో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

11, అక్టోబర్ 2017, బుధవారం

అలుపేలేని నటనకు కేరాఫ్ అడ్రస్

సాధారణంగా ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ వయసు 58-60 సంవత్సరాలు.  ఆ లెక్కన చూసుకుంటే అమితాబ్ బచ్చన్ రిటైర్ అయి 15 సంవత్సరాలు అవుతుంది.  75 సంవత్సరాల వయసులో కూడా 25  సంవత్సరాల కుర్రాడిలా ఇటు సినిమాలు,  అటు టి.వి షోలతో బిజీగా వున్నారు. 1969లో చిత్ర రంగ ప్రవేశం చేసిన అమితాబ్, సాథ్ హిందుస్థానీ చిత్రంతో మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నారు. 1973లో వచ్చిన "జంజీర్" అమితాబ్ కు స్టార్డం తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం జయభాధురితో వివాహం జరిగింది.1975 సంవత్సరం అమితాబ్ కు గొప్ప మలుపు ఇచ్చిన సంవత్సరంగా నిలిచిపోయింది. "దీవార్" తో మరోసారి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకోవడమే కాకుండా "షోలే" రూపంలో భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బంపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలివుడ్ లో అమితాబ్ కు ఎదురేలేక పోయింది. 1982 లో "కూలీ" షూటింగ్ సందర్భంగా తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి విజయుడిగా  నిలిచారు. సాక్ష్యాత్ దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అమితాబ్ చికిత్సపై డాక్టర్స్ ను ప్రత్యేకంగా సంప్రదించారంటే అమితాబ్ ప్రాముఖ్యత అర్ధమౌతుంది. ఇందిరా గాంది మరణం తదుపరి ఆమె కుమారుడు రాజీవ్ గాంధి విజ్ణప్తి పై కాంగ్రెస్ పార్టీలో చేరి,  ఉత్తర్ ప్రదేశ్ నుండి ఎం.పి గా ఎన్నికయ్యారు. రాజకీయాలు తనకు సరిపడని అంశమని కొద్ది కాలంలోనే బయటకు వచ్చేసారు.   సెకండ్ ఇన్నింగ్స్ లో "షెహన్ షా", "హం", "అగ్నిపత్", "ఖుదాగవా"  చిత్రాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. "అగ్నిపత్" లో నటనకు గాను మొట్ట మొదటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. తరువాత కొన్ని పరాజయాలు పలకరించడంతో మళ్ళీ విరామం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అమితాబ్ ప్రారంభించిన "ఎబిసిఎల్" మొదట్లో బాగానే వున్నా, తదుపరి తీవ్ర నష్టాలలో కూరుకు పోయింది. మరల 2000 నుండి వయసు మీరిన పాత్రలతో నటిస్తుండడం, మరో ప్రక్క "కౌన్ బనేగా కరోడ్పతి" టివి షో వ్యాఖ్యాతగా విషేషంగా రాణిస్తూ ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. 2005లో "బ్లాక్", 2008 లో "పా", 2015 లో "పీకు" చిత్రాలలోని పాత్రలకుగాను బెస్ట్ ఏక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డ్స్,  పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తీసుకోవడమే కాకుండా, "సూపర్ స్టార్" అన్న పదానికి సార్ధకత చేకూర్చారు అమితాబ్. నేడు 75 వ జన్మదినం జరుపుకొంటున్న అమితాబ్ కు భారతీయ సినీ పరిశ్రమ ఘనంగా శుభాకాంక్షలు పలుకుతుంది.       

8, అక్టోబర్ 2017, ఆదివారం

వ్యక్తిగత జీవితంలోనూ తండ్రి నాగార్జున నే అనుసరించిన చైతన్య

"ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగ చైతన్య, సమంతలు నిజ జీవితంలో కూడా ప్రేమ పెళ్ళితో ఒక్కటయ్యారు. కీ. అక్కినేని నాగేశ్వరరావు అంతగా చదువుకోకపోయినా, విశాల దృక్పథం కలిగి, సినీ పరిశ్రమలో ఆదర్శప్రాయ జీవితం గడిపారు.తన కుమారుల ఇష్టాలను గౌరవించి,  వారికి తమ జీవితాలను తీర్చి దిద్దుకోవడంలో పూర్తి స్వేచ్చను ఇచ్చారు. ఆ స్వేచ్చతోనే నాగార్జున సినిమా హీరోగా నిలదొక్కుకోని, తనతోపాటు హీరోయిన్ గా  నటించిన అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున అదే స్వేచ్చను తన కుమారుడు చైతన్యకు కూడా వారసత్వంగా ఇచ్చారు. తొలుత ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ గా రాణించడానికి ఇష్టపడిన చైతన్య, తదుపరి సినిమాలపై ఆసక్తితో హీరోగా రూపాంతరం చెందాడు. తండ్రి నాగార్జున బాటలోనే పయనిస్తూ- తన తొలి చిత్ర నాయకి సమంతతో ప్రేమలో మునిగి, ఇరు పెద్దల అంగీకారంతో  ఆమెను  అర్ధాంగిగా  చేసుకున్నాడు.. అమితాబ్-జయభాదురి, కృష్ణ-విజయనిర్మల, నాగార్జున-అమల, రాజశేఖర్-జీవిత, అజిత్-షాలిని, సూర్య-జ్యోతిక తదితర సినీ దంపతులులా వీరు కూడా చిరకాలం దాంపత్యం సాగించాలని ఆకాంక్షిద్దాం, ఆశీర్వదిద్దాం. 

5, అక్టోబర్ 2017, గురువారం

2, అక్టోబర్ 2017, సోమవారం

ఎన్ టి ఆర్ జీవిత చిత్రాల మధ్య రగులుతున్న వివాదం

సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడిన మనిషి.  అటువంటి వ్యక్తి జీవత చరిత్రపై ప్రస్తుతం నిర్మాణం కానున్న చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.  మొదటిగా ఎన్ టి ఆర్ కుమారుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్ టి ఆర్ జీవిత కథను తనే హీరోగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. స్వతహాగానే కుటుంబం అంతా మద్దతు ప్రకటించారు.  లక్ష్మీ పార్వతి మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.  ఈ చిత్రంలో తననే విలన్ గా చూపే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆందోళన పడుతున్నారు. ఎన్ టి ఆర్ కుటుంబ కోణంలో చూస్తే లక్ష్మీ పార్వతి ప్రవేశం అన్నది ఎన్ టి ఆర్ పతనానికి నాందీవాచకం.  ఇటువంటి సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్ టి ఆర్" చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా,  ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులలో కలవరం రేకెత్తిస్తుంది.  ఇది లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తున్న చిత్రం కాబట్టి, ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులు పై వ్యతిరేక ప్రభావం ఏర్పడేలా చిత్రీకరణ జరుగుతుందని వారు  ఆందోళన చెందుతున్నారు.  బాలకృష్ణ చిత్రం ఇంకా కథా చర్చలలోనే వుంది.  కానీ రాంగోపాల్ వర్మ తలచుకుంటే నెల రోజులలోనే తన సినిమా పూర్తి చేసి జనంలోకి వదిలేయగలడు.  వివాదాస్పద అంశాలు, ఘటనలే రాంగోపాల్ వర్మకు ప్రచార సాధనాలు,  ఆదాయ వనరులు.  ఎవరి మనోభావాలు, అభిప్రాయాలతోను పనిలేకుండా తను అనుకున్నది తీయడమే వర్మ నైజం.  ఈ చిత్రానికి లక్ష్మీ పార్వతి తెరవెనుక నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినవస్తున్నాయి. ఎవరి చిత్రం వాస్తవానికి దగ్గరగా వుండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...