2, సెప్టెంబర్ 2017, శనివారం

ప్రేక్షకుల నుండి "పైసా వసూల్" అయ్యేనా!

 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తదుపరి నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ తో చిత్రం అనౌన్స్ చేయగానే పరిశ్రమలో   తీవ్ర  ఆసక్తి  నెలకొంది.  ఇద్దరూ డిఫరెంట్ స్కూల్స్ అవడంతో ఎవరు ఎవరి శైలి ఫాలో అవుతారో అన్న ఉత్కంఠకు శుక్రవారంతో తెర పడింది. "పైసా వసూల్" లో బాలకృష్ణను డిఫెరెంట్ గా చూపడంలో పూరీ కృతకృత్యుడయ్యాడు.  కాకపోతే పూరీ మాత్రం తన మూస ధోరణి నుండి బయటపడలేక,  సినిమా అంతా తన గత చిత్రాల వాసనలతో నింపేశాడంటున్నారు.  ఫస్ట్ హాఫ్ ను రసవత్తరంగా మలచినా,  సినిమాకు ప్రాణం అయిన సెకండ్ హాఫ్ ను ఆ మేరకు రక్తి కట్టించలేక పోయాడు.  పూరీ చిత్రాలలో చిత్రం జయాపజయాలకు అతీతంగా, హీరోయిన్, విలన్ పాత్రలు, సాంగ్స్ కు ప్రత్యేకత వుంటుంది.  ఈ చిత్రంలో వాటికీ   న్యాయం చేయలేక పోయాడంటున్నారు.  బాలకృష్ణలాంటి సీనియర్ హీరో పూరి దర్శకత్వంలో ఎటువంటి భేషజం  లేకుండా   ఒదిగిపోయి నటించడమన్నది అభినందించాల్సిన విషయం.  ఫైనల్ గా "పైసా వసూల్"  ఫక్తు బాలకృష్ణ అభిమానుల చిత్రంగా తేల్చేశారు ప్రేక్షకులు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...